టంగుటూరు మండలం కొణిజేడులో గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం ఆత్మహత్యకు మత్నించాడు. చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు. కర్ణాటకకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మృతుడిని గుర్తిస్తే టంగుటూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.