నంద్యాల అర్బన్: ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర ముగించుకుని నంద్యాలకు చేరిన విద్యార్థులు
Nandyal Urban, Nandyal | May 2, 2026
నంద్యాల జిల్లాకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ ముగించుకుని శనివారం క్షేమంగా తిరిగొచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యాత్ర జిల్లాకు గర్వకారణమని వారు తెలిపారు