ఒంగోలు అర్బన్: ఒంగోలులో బిసివై పార్టీ నాయకులు మీడియా సమావేశం, ఏప్రిల్ 11 నుంచి పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష
Ongole Urban, Prakasam | Apr 3, 2026
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల హక్కుల సాధనకు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఒంగోలులో బిసివై నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ మహిళా నాయకురాలు మీసాల సామ్రాజ్యం శుక్రవారం ఒంగోలు ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. బీసీ కులగన చేపట్టాలని ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.