ఒంగోలు అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయల బహుమానాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 2, 2026
సమగ్ర ప్రణాళిక, నిరంతర సాధనతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. తాజాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వివిధ శాఖల ఆధ్వర్యంలోని సంక్షేమ హాస్టళ్లలో చదువుతూ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో అభినందన కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వన్ ఆఫీసర్ - వన్ ఇనిస్టిట్యూట్ ' ఉత్తమ ఫలితం సాధించడంలో తోడ్పడింది అన్నారు.