ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా, అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు.జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు గారు నిస్వార్థ సేవకు, అసమాన త్యాగానికి చిరునామాగా నిలిచారు. గాంధేయవాది అయిన ఆయన, భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం 58 రోజుల ఆమరణ దీక్ష చేసి, తమ దేహాన్ని ఆహుతి చేశారు. ఆయన త్యాగం భారతదేశ చరి