ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ శుక్రవారం మడకశిరలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కే. సోమన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాప్తాడు ధర్మవరంలో రైల్వే సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పావగడ ఎమ్మెల్యే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.