బనగానపల్లె: నంద్యాల జిల్లాలో మొక్కజొన్న ధర పతనంతో రైతుల ఆవేదన
నంద్యాల జిల్లాలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ధరలు పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో క్వింటాల్కు రూ.3,500 వరకు పలికిన ధర ప్రస్తుతం రూ. 1,500 నుంచి రూ. 1,800 మధ్యకే పరిమితమైందని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని వారు కోరుతున్నారు.