ATM డిపాజిట్ మెషీన్లు (CDM), PhonePe/UPI ను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.“తెలియని వ్యక్తుల కోసం ATM CDM లో డబ్బు జమ చేయండి”, “PhonePe/UPI ద్వారా పంపండి”, “కమిషన్ ఇస్తాం” అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాలకు చెందుతాయని, వాటిలో పాల్గొనేవారిని కూడా నేర సహకారులుగా పరిగణిస్తామని తెలిపారు.