కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గంజాయి, తదితరాలు ఏవి అక్రమ రవాణా జరుగకుండా చర్యలు చేపట్టారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తున్నారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.