అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో కురుగుంట గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కృష్ణా నాయక్ (35) మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాదానికి గురి అయిన కారులోనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అయితే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఘటనపై కూడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.