డోన్: పాత పెన్షన్స్ స్కీం పునరుద్ధరించాలంటూ డోన్ మండలంలో టీచర్ల నిరసన
Dhone, Nandyal | Apr 21, 2026 సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరుతూ డోన్ మండలం ఎర్రగుంట్ల జడ్పీ హైస్కూల్లో 'మహా గర్జన' వాల్ పోస్టర్లు విడుదల చేశారు. హెచ్ఎం జీవి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడే రోజు కడపలో ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిర్వహించే సభకు ఉపాధ్యాయులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.