నంద్యాల అర్బన్: నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయానికి భూమి పూజ
Nandyal Urban, Nandyal | May 6, 2026
నంద్యాలలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శబరి ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ భవనం పార్టీ బలోపేతానికి ఎంతగానో తోడ్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్, ఏపీఎస్ఓసీసీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.