అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆర్డిటి వద్ద ఉన్న శివకోటి శ్రీ పీఠంలో శుక్రవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఆలయ వ్యవస్థాపకుడు అప్పు స్వామి ఆధ్వర్యంలో అతిరుద్ర సహస్ర శంఖాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ అప్పు స్వామి తదితరులు మాట్లాడుతూ శ్రీ పీఠంలో అతి రుద్ర సహస్త్ర శంఖాభిషేకం కార్యక్రమంలో భాగంగా కలిసి స్థాపన ప్రాణ ప్రతిష్ట గణపతి పూజ అన్నాభిషేకం లలిత పారాయణం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయనిర్వాకుడు అమర్నాథ్ ఆలయ వ్యవస్థాపకుడు అప్పు స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి హరి వందలాది మంది మహిళ భక్తులు పాల్గొన్నారు.