రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆదివారం గ్యాస్ లీక్ కావడంతో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాధవి ఠాగూర్ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన మాధవిని ఆస్పత్రికి తరలించారు.