సూర్యాపేట: జిల్లా సమీకృత అధికారుల కార్యాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
పనిచేసే చోటనే ఉద్యోగులకు గృహ సముదాయాలు ఉండటంవల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.గురువారం ఆయన సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో ఆవరణలో 8 కోట్ల 74 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్,డిఆర్వో, జిల్లా అధికారుల నివాస భవనములను ప్రారంభించారు.