గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ నాగార్జున రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో సీఎం గా ఉన్నప్పుడు జగనన్న కేవలం ప్రాజెక్టు టనల్స్ మాత్రమే పూర్తి చేసినట్లు చెప్పారని ప్రాజెక్టు ఎక్కడ పూర్తి అయినట్లు చెప్పలేదని నాగార్జున రెడ్డి అన్నారు. అయితే ప్రాజెక్టు ఎక్కడ పూర్తయిందని ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో పనులు జరుగుతున్న విషయాన్ని ప్రజలు చూస్తున్నారని టిడిపి నాయకులు అన్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ సొరంగాలు పూర్తయినట్లుగా జగన్ చెప్పినప్పటి మాటలను ప్రచారం చేస్తున్నారు.