బనగానపల్లె: బనగానపల్లె తెలుగు పేట ఆదర్శ పాఠశాలలో'" ఫుడ్ ఫెస్టివల్ "కార్యక్రమం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం తెలుగు పేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం ప్రతాప్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం గురువారం జరిగింది. ఐదో తరగతి విద్యార్థులు పలు వంటకాలతో పోటీల్లో పాల్గొన్నారు. సుచిత్ర 1వ, రుక్సానా 2వ, మహాలక్ష్మి 3వ స్థానాలను దక్కించుకున్నారు. వీరికి ప్రోత్సాహక బహుమతులను హెచ్ఎం అందజేశారు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు బాల్యంలోనే తెలుసుకొని అలవర్చుకొని ఆచరించాలని ప్రధానోపాధ్యాయులు సూచించారు