కనిగిరి నియోజకవర్గ అభివృద్ధిని మరిచిన వైసిపి నాయకులు కోటి సంతకాల సేకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి లోని తన కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైసిపి హయాంలో కనిగిరి నియోజకవర్గం లో ట్రిపుల్ IT, NIMZ, నడికుడి రైలు మార్గం, OV రోడ్డు, బైపాస్ రోడ్డు తదితర పనులు జరగనప్పుడు వాటిని పూర్తి చేయాలని వైసిపి నాడు కోటి సంతకాల సేకరణ ఎందుకు చేపట్టలేదని ఎమ్మెల్యే విమర్శించారు. టీడీపీ హయాంలోనే కనిగిరి అభివృద్ధి చెందిందన్నారు.