అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని వాల్మీకి భవన్ నందు ఆదివారం బహుజన యువసేన ఆధ్వర్యంలో చంద్ర చర్ల హరి వాల్మీకి నాయకత్వంలో వాల్మీకుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని విడపనకల్లు వజ్రకరూరు కూడేరు మండలాల నుండి పాల్గొన్న వాల్మీకులు సోదరులతో కలసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర చర్ల హరి వాల్మీకి మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి పునరుద్ధరిస్తామని మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఎస్టీ పునరుద్ధరణ అంశం సమైక్యంగా ఉంది సాధిద్దామని పిలుఫునిచ్చారు.