కథలాపూర్: పేదల ఆరోగ్యానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: టిపిసిసి కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య
పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పీసీసీ మెంబర్ తొట్ల అంజయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి రూ.15.27 లక్షలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డిలకు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.