ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకీ ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ఈవో తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో భక్తులు, అర్చకులు స్వామివారిని పల్లకిలో ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి నినాదాలతో గ్రామం మారుమోగిపోయింది. ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.