దొంగతనం కేసులో నంద్యాల జిల్లాకు చెందిన నలుగురికి జైలు శిక్ష
Nandyal Urban, Nandyal | Apr 28, 2026
దొంగతనం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నలుగురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తంబళ్లపల్లె కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నంద్యాల జిల్లాకు చెందిన అంకన్న, సత్య హరిశ్చంద్రుడు, చిన్న హుస్సేని, జంబులును పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్య గారిపల్లెలో అక్టోబర్ 2025న దొంగతనం నేరంలో అప్పటి ఎస్ఐ హరిహర ప్రసాద్ అరెస్టు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు.