సింగరాయకొండ మండలంలోని శ్రీ ప్రసన్నాంజనేయ తిరుణాల మరియు రథోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కొరకు 650 మంది పోలీసు భద్రత సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో 40 మంది ఎస్ఐలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. 69 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తోపులాట లేకుండా బారికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.