నందికోట్కూరు: మెరిసిన కలమందలపాడు ఆణిముత్యం 582 మార్కులతో : మిడుతూరు మండల టాపర్ గా మషీరా
గురువారం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కలమందలపాడు గ్రామంలో ఓ పేదింటిలో విద్యా కుసుమం వెల్లివిరిసింది,నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో మారుమూల గ్రామమైన కలమందలపాడులో జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న గ్రామానికి చెందిన దూదేకుల మషీరా 600 మార్కులకు గాను 582 మార్కులతో మండల టాపర్ గా నిలిచింది,మిడుతూరు మండలంలో 429 మంది విద్యార్థులకు గాను 342 మంది విద్యార్థులు(79.72 శాతం)ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ-2 మల్లికార్జున నాయక్ అన్నారు.కస్తూర్బా పాఠశాలలో 38 మందికి గాను 32 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. మోడల్ పాఠశాలలో 92 మంది విద్యార్థులకు గాను 84 మంది వ