బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో గిరిజన గౌరవ దినోత్సవ శోభాయాత్ర నిర్వహించారు. ట్యాంక్ బండ్ స్వామి వివేకానంద విగ్రహం నుండి కొమరం భీమ్ విగ్రహం వరకు శోభాయాత్ర కొనసాగింది. బీర్సా ముండా 150వ జయంతిని సందర్భంగా కేంద్రమంత్రి సావిత్రి ఠాకూర్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.