ఒంగోలు అర్బన్: ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 11 గంటల వరకే నిర్వహణ
Ongole Urban, Prakasam | May 10, 2026
ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో మే 11 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 11 గంటల వరకే నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై 11 గంటల లోపే ముగుస్తుంది అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.