సూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద గురువారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆరు నెలలుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అందకపోవడంపై అఖిలపక్ష పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు నాయకులు పాత జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.