డోన్: బుధవారం బేతంచెర్ల మద్దిలేటి స్వామి ఆలయ హుండీ లెక్కింపు : ఆలయ ఈవో రామాంజనేయులు
Dhone, Nandyal | Jun 16, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ మద్దిలేటిస్వామి ఆలయంలో 17వ తేదీ బుధవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఉప కమిషనర్ ఎం.రామాంజనేయులు తెలిపారు. భక్తులు సమర్పించిన ఈ నగదు లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. గత 34 రోజుల హుండీ ఆదాయాన్ని జిల్లా దేవాదాయశాఖ తనిఖీ అధికారి రమేశ్ పర్యవేక్షణలో లెక్కిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.