గుర్రంకొండ మండలంలో గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వాల్మీకిపురం సీఐ బి.రాఘవ రెడ్డి తెలిపారు. శనివారం గుర్రంకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బాలకృష్ణ తో కలిసి సీఐ రాఘవ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. జూలై 29వ తేదీన అప్పటి సీఐ జె.ప్రసాద్ బాబు,గుర్రంకొండ ఇన్చార్జి ఎస్ఐ చంద్రశేఖర్ కు రాబడిన సమాచారం మేరకు గుర్రంకొండ మండలం,చిట్టి బోయినపల్లి బస్ స్టాప్ వద్ద కొందరు గంజాయి అమ్ముతున్నట్టు అందిన సమాచారంతో దాడులు చేసి ముగ్గురిని పట్టుకోగా మరొక వ్యక్తి పరారయ్యాడు. పరారైన కమాల్ భాష ను గుర్రంకొండలోని ఇందిరమ్మ కాలనీలో అరెస్టు చేసినట్లు తెలిపారు