ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎస్సై మురళి పలు సూచనలు చేశారు. ఊర్లకు వెళ్లేవారు తమ బంగారం వెండి నగలను భద్రపరచుకొని వెళ్లాలన్నారు. లేదా వాటిని వెంట తీసుకొని వెళ్లాలని తెలిపారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే సంబంధిత ఇంటిపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. కొత్తగా అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనపడినట్లయితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.