ధర్మవరం పట్టణం హిందూస్మశాన వాటికి వద్ద శనివారం 65 సంవత్సరాల వయసుగల గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు గమనించి వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకొని విచారణ చేశారు.మృతి చెందిన వ్యక్తి యొక్క వివరాలు తెలిసినవారు వన్ టౌన్ పోలీసులను సంప్రదించాలని సిఐ నాగేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.