జగన్ కు ఇంకా పేర్ల పిచ్చి, ఫోటోల పిచ్చి పోయినట్టు లేదు : ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
జగన్ కు ఇంకా పేర్ల పిచ్చి,ఫోటోల పిచ్చి పోయినట్టు లేదని అందుకే నా పేరు జగన్ రాజధాని పేరు మావిగన్ అంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. శుక్రవారం సాయంత్రం 4:30 సమయంలో అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.27వ విడుతలో మొత్తం 24మందికి 15లక్షల రూపాయలు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల కనీసం కోటి రూపాయలు కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22నెలల్లో నియోజకవర్గంలో 550మందికి మొత్తం ఐదున్నర కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం చేసినట్టు చెప్పారు.