రామకుప్పం మండలంలోని రామాపురం తండాకు చెందిన 25 కుటుంబాలు వైసిపినీ వీడి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సమక్షంలో టీడీపీ పార్టీలో సోమవారం చేరారు. సీఎం చంద్రబాబుతోనే కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధిలో తాము భాగస్వాములు కావాలని టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. వారికి పార్టీ కండువాతో ఎమ్మెల్సీ స్వాగతం పలికారు.