ఒంగోలు అర్బన్: వర్జీనియా పొగాకు రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా భారీ ట్రాక్టర్ ర్యాలీ
Ongole Urban, Prakasam | Jun 19, 2026
ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళన ఉధృతమైంది. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు జిల్లా కేంద్రం ఒంగోలులో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న రైతులు, ప్రభుత్వం ప్రకటించిన రూ.200 ధర సరిపోదని, కనీసం రూ.250 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పొగాకు బోర్డు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రైతుల వద్ద ఉన్న పొగాకును చివరి ఆకువరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న పొగాకు రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు