రైల్వే కోడూరు మండలంలో శ్రీ మహాగణపతి గ్రామోత్సవంలో ఇరువర్గాల ఘర్షణ, పలువురికి గాయాలు
రైల్వే కోడూరు మండలం అయ్యవారిపల్లి గ్రామ పరిధి లోని అరుంధతి వాడలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు రైల్వేకోడూరు ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సాయంత్రం గ్రామంలో శ్రీ మహాగణపతి గ్రామోత్సవం జరుగుతుండగా ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఆయన తెలిపారు. కట్టెలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఈ ఘటనలో ఐదు మంది తీవ్రంగా గాయపడగా, ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని, వారిని 108 వాహనంలో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తెలిపారు.