రాప్తాడు: ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు ఉత్సవాలు ప్రారంభించడం ఆనందంగా ఉంది ఉప్పరపల్లి వద్ద సిసిఎల్ఏ స్పెషల్ సిఎస్ జయలక్ష్మి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆర్డిటి క్రీడా మైదానంలో శుక్రవారం 12 గంటల పది నిమిషాల సమయంలో ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడల్లో భాగంగా వాలీబాల్ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ అండ్ స్పెషల్ సిఎస్ జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం మూడు రోజులు పాటు ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని రెవెన్యూ ఉద్యోగులు మూడు రోజులు పాటు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని గెలుపు ఓటములను సమానంగా తీసుకొని రెవిన్యూ ఉద్యోగులుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని స్పెషల్ సిఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు.