పుల్లారెడ్డి కండ్రికలో హత్య సంఘటనపై నిజ నిజాలు వెలికి తీస్తాం: అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి
హత్య సంఘటన పై నిజానిజాలు వెలికి తీస్తాం: అడిషనల్ ఎస్పీ శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగలో జరిగిన వృద్ధురాలు హత్యపై క్షుణ్ణంగా పరిశీలించి నిజానిజాలు వెలికి తీస్తామని అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి తెలిపారు. గురువారం ఆయన సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నామన్నారు. కొంతమందిని విచారించడం జరిగిందన్నారు. గ్రామంలో డాగ్ స్క్వాడ్ కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.