షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన కవిత, వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు, ఔషధాల లభ్యతపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది, ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడిన కవిత, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు చేరేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు.