తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 'జనం బాట' కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లికి బయలుదేరారు. కూకట్పల్లి KPHBలోని మహాత్మ గాంధీ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల విద్యార్థులు మంగళహారతితో ఆమెకు స్వాగతం పలికారు. కవిత జాతీయ రహదారిపై విద్యార్థులు నిర్వహించిన ‘సే నో టు డ్రగ్స్, సే నో టూ బెట్టింగ్' ఫ్లకార్డుల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.