రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలోని పంచ సూత్రాల అమలుతో రైతుల ఆర్థిక అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా జరుగుతున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో పంచ సూత్రాల అమలు మరియు అవగాహన కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సంబేపల్లి మండలం మోటకట్ల మరియు రాయచోటి మండలం ఇందుకూరు పల్లి లలో జరుగుతున్న పంచ సూత్రాల అవగాహన కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు.