రాజేంద్రనగర్: వ్యవస్థలకు దళితులు అంటరాని వారు అయ్యారు : షాద్నగర్లో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహ
షాద్నగర్లో ఎమ్మార్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి జరిగితే దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని, ఈ దేశ చట్టపరమైన వ్యవస్థలకు కూడా దళితులు అంటరానివారయ్యారని మండిపడ్డారు.