గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపికను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ చట్టం–2018తో పాటు గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలపై సమగ్ర సమాచారంతో 292 పేజీలుగా ఈ పుస్తకాన్ని TGIRD రూపొందించింది