సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ మొండి వైఖరి: సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మొండివైఖరిని అవలంబిస్తోందని టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మలారెడ్డి ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలో ఆమె మీడియాతో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసినట్లు ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే అమలు అవుతాయని నిర్మలారెడ్డి పేర్కొన్నారు.