ఒంగోలు అర్బన్: జవహర్ నవోదయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 23, 2026
*పత్రిక ప్రకటన* ఒంగోలు, తేది.23.6.2026. ........................... ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ(VMC) సమావేశం మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మరియు విద్యాలయ కమిటీ చైర్మన్ శ్రీ.పి. రాజాబాబు వారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విద్యాలయం యొక్క ప్రగతి గురించి గత సంవత్సరంలో 10 వ తరగతి, మరియు 12 తరగతి లలో సాధించినటువంటి ఫలితాలు గురించి, విద్యాలయంలో క్రీడలు, పురోభివృద్ధి గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి పలు అంశాలను, అన్ని విషయాలను నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ.సి.శివరాం, జిల్లా కలెక్టర్ కు వివరించారు.