జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో 382వ డివిజన్లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలను మాగంటి సునీతమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించిన గోవర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, సునీతమ్మ విజయం ద్వారా ఆ అభివృద్ధి మరింత వేగం పొందుతుందని తెలిపారు.