రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు అండర్ 17 జట్టు తరఫున ధర్మవరం క్రీడాకారులు ఎంపికైనట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జయచంద్ర రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ధర్మవరం బాలుర కళాశాల మైదానంలో ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు.