అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు తండాలో సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శ్రీ కాళికామాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పంపునూరు తండాలో స్థానిక గ్రామస్తుల ఆహ్వానం మేరకు మంగళవారం రోజున శ్రీ కాళికామాత విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అన్నారు భవిష్యత్తులో ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు.