ఒంగోలు అర్బన్: టిడిపి వారు ఇబ్బంది పెడుతున్నారు అంటూ కలెక్టరేట్ వద్ద జనసేన కార్యకర్త నిరసన
Ongole Urban, Prakasam | May 16, 2026
కూటమి ప్రభుత్వంలో జనసేన అధికారంలో ఉన్నా కూడా తమకు న్యాయం జరగడం లేదని దర్శి జనసేన కార్యకర్త అవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తనపై దాడి చేశారని.. తన ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వడం లేదని జనసేన కార్యకర్త యాదాల సురేష్ తెలిపారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో తాను నివాసం ఉంటున్నాను.. గతంలో తనపై, తన అమ్మగారిపై టీడీపీ నేత గుంటిగంగ దేవాలయం చైర్మన్ సురేష్, అతని మామ దాడి చేశారన్నారు. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా... నేటికీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. PGRS లో జిల్లా కలెక్టర్ ను కలిసి 10 సార్లు ఫిర్యాదు చేశానన్నారు.