ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.32 లక్షలు మోసం చేసిన అన్సారీ మొహమ్మద్ ఉమర్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ యాప్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా బాధితులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. చైనా జాతీయుడితో నేరుగా సంప్రదింపులు పెట్టుకుని డబ్బును క్రిప్టో రూపంలో విదేశాలకు పంపినట్టు గుర్తించారు.