పాణ్యం: నన్నూరు టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం
ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం స్థానికుల సమాచారం మేరకు నంద్యాల నుండి కర్నూలుకు వెళ్తున్న ఒక వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.